తెదేపా ఆధ్వర్యంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో తెదేపా కార్యకర్తలు వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ అధినేత

Published : 12 Aug 2022 05:10 IST

పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో తెదేపా కార్యకర్తలు వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆగస్టు 15న గుంటూరు నగరం.. స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి వచ్చేవారు తమ వాహనాలకు పార్టీ జెండాలు కాకుండా జాతీయ జెండాలు మాత్రమే కట్టుకురావాలని కార్యకర్తలకు సూచించారు. అందరూ ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో పాల్గొనాలని చంద్రబాబు కోరినట్లు తెదేపా గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని