సీఎం కేసీఆర్‌వి అన్నీ మోసపూరిత హామీలే: షర్మిల

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చే హామీలన్నీ మోసపూరితమేనని, ఏ ఒక్కదాన్నీ నెరవేర్చరని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌కు మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే మీ పిల్లలు

Updated : 12 Aug 2022 06:27 IST

కోస్గి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చే హామీలన్నీ మోసపూరితమేనని, ఏ ఒక్కదాన్నీ నెరవేర్చరని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌కు మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే మీ పిల్లలు మిమ్మల్ని క్షమించబోరని అన్నారు. గురువారం వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలంలో మొదలైన షర్మిల పాదయాత్ర దుద్యాల మీదుగా నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోకి ప్రవేశించింది. హకీంపేట, పోలేపల్లి, సర్జఖాన్‌పేట, ఈజీపూర్‌, కోస్గిలో కొనసాగింది. ఈ సందర్భంగా అనంతరం ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ గారడి మాటలు, గొప్పలు చెప్పుకుంటూ ఓట్లు వేయించుకున్నారు తప్ప ఏనాడూ ప్రజల గురించి పట్టించుకున్నది లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని