భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌ పదవికి కవిత రాజీనామా చేయాలి: జి.నిరంజన్‌

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర కమిషనర్‌ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. దోమలగూడలోని భారత్‌ స్కౌట్స్‌

Published : 12 Aug 2022 06:17 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర కమిషనర్‌ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. దోమలగూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మోడల్‌ స్కూల్‌లో స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో పాల్గొన్న కవిత.. అక్కడే మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పడం ఆక్షేపణీయమన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సంస్థ ఈ రాజకీయ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని కమిషనర్‌ పదవి నుంచి ఆమెను తప్పించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని