ప్రజలకు సంజయ్‌ జవాబివ్వాలి: చాడ

ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అమలుపరచకుండా అన్యాయం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. వీటి అమలు విషయంలో

Published : 13 Aug 2022 04:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా అమలుపరచకుండా అన్యాయం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. వీటి అమలు విషయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఏం చేశారని ప్రశ్నించారు. మునుగోడులో కమ్యూనిస్టులకు పోటీ చేసే దమ్ముందా.. అని సంజయ్‌ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశాన్ని మతోన్మాదంతో విభజిస్తూ తిరోగమన ఆర్థిక విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న భాజపా ఉనికి రాష్ట్రంలో లేకుండా చేయడమే కమ్యూనిస్టుల లక్ష్యమని అన్నారు. గ్యాస్‌ ధరలను రెండింతలు చేసిన కేంద్రం తీరుపై పాదయాత్రలో నిలదీస్తున్న ప్రజలకు బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని