పరివార్‌వాద్‌, దోస్త్‌వాద్‌ పార్టీలతో వినాశనం

కుటుంబ పార్టీలు (పరివార్‌వాద్‌), మిత్రుల ప్రయోజనాలే ముఖ్యమైన పార్టీలు (భాజపా) దేశాన్ని సర్వనాశనం చేస్తాయని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భాజపా

Published : 13 Aug 2022 05:44 IST

కాంగ్రెస్‌, భాజపా లక్ష్యాలుగా కేజ్రీవాల్‌ ధ్వజం

దిల్లీ: కుటుంబ పార్టీలు (పరివార్‌వాద్‌), మిత్రుల ప్రయోజనాలే ముఖ్యమైన పార్టీలు (భాజపా) దేశాన్ని సర్వనాశనం చేస్తాయని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆహార పదార్థాలపైనా జీఎస్టీ విధించడం దారుణమన్నారు. సంక్షేమ పథకాలపై వెచ్చిస్తున్న ధనం దేశాన్ని నాశనం చేస్తోందంటూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజలను భయపెడుతున్నట్లుగా ఉన్నాయని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా తెలిపారు.

కేంద్రంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్‌ ‘అసత్యాల మంత్రి’ అని కేంద్ర సమచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ అభివర్ణించారు. సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు వేర్వేరని.. కేజ్రీవాల్‌ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రెండింటినీ కలిపి మాట్లాడుతున్నారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని