గోరంట్ల మాధవ్పై సీఎం చర్యలు తీసుకోవాలి
పార్టీని కాపాడుకోవాలన్నా, మహిళల ఓట్లు మనకు రావాలన్నా ఎంపీ గోరంట్ల మాధవ్పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్
వైకాపా ఎంపీ రఘురామ డిమాండ్
ఈనాడు, దిల్లీ: పార్టీని కాపాడుకోవాలన్నా, మహిళల ఓట్లు మనకు రావాలన్నా ఎంపీ గోరంట్ల మాధవ్పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా నాయకుడు పట్టాభి విడుదల చేసిన మీడియా ప్రకటనను చూసి ఎక్లిప్స్ సంస్థపై నేను ఆరా తీశా. ప్రతిష్ఠాత్మక సంస్థగా ఎక్లిప్స్కు గుర్తింపు ఉంది. వీడియోలో ఎటువంటి మార్ఫింగ్ లేదని ఆ సంస్థ నిర్ధరించింది. వీడియోలో ఉన్నది మాధవేనని నిర్ధరణయ్యాక కూడా వెయ్యి వాహనాలతో రాయలసీమలో ఊరేగిస్తే రానున్న ఎన్నికల్లో వస్తాయనుకుంటున్న 30-35 స్థానాలు కూడా మా పార్టీకి రావు...’ అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక శాసనసభలో నీలి చిత్రాలను చూసిన ఇద్దరు సభ్యులను ప్రవర్తనా నియమావళి కింద సస్పెండ్ చేసిన విషయాన్ని ఎంపీ రఘురామ గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ