అప్రతిష్ఠపాలు చేసేందుకే నాపై దుష్ప్రచారం

గత ఎన్నికల్లో తన చేతిలో ఓడిన అభ్యర్థి తనను రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన

Published : 14 Aug 2022 06:06 IST

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా ఆరోపణ

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: గత ఎన్నికల్లో తన చేతిలో ఓడిన అభ్యర్థి తనను రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆరోపించారు. కొత్తగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో నియోజకవర్గ ఫలితాలపై హైకోర్టులో కేసు నడుస్తోందని వనమా గుర్తుచేశారు. ఆస్తులు, కేసుల వివరాలు తప్పుగా ఎన్నికల సంఘానికి సమర్పించానంటూ నమోదైన ఈ కేసులో త్వరలో తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందని భావిస్తూ సదరు అభ్యర్థి, కొందరు మీడియా వ్యక్తులు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారన్నారు. వెనుకబడిన కులానికి చెందిన వాణ్ని కావడం వల్లే ఇలా కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆశీస్సులతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా తానే బరిలోకి దిగనున్నట్లు వనమా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని