భాజపాను ఓడించే గెలుపు గుర్రానికే మద్దతు

దేశానికే ప్రమాదకారిగా మారిన మతతత్వ భాజపాను ఓడించకుంటే పెను ప్రమాదం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ముసలిమడుగులో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు

Published : 15 Aug 2022 05:39 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

వైరా, న్యూస్‌టుడే: దేశానికే ప్రమాదకారిగా మారిన మతతత్వ భాజపాను ఓడించకుంటే పెను ప్రమాదం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ముసలిమడుగులో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మునుగోడులో భాజపాను ఓడించేందుకు ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధం. ప్రస్తుతానికి భాజపాను ఓడించే శక్తి తెరాసకు ఉంది. కానీ రూ.వందల కోట్ల మేర ప్రలోభాలు జరుగుతున్న నేపథ్యంలో పరిణామాలెలా ఉంటాయో చూడాల్సి ఉంది. తర్వాతి పరిణామాలను బట్టి భాజపాను ఓడించే శక్తి ఉన్న గెలుపు గుర్రానికే మద్దతు ఇస్తాం’’ అని అన్నారు. ఒకప్పుడు డబ్బు ఎరచూపి పార్టీ ఫిరాయింపులు చేసేవారని.. భాజపా మాత్రం ఈడీ, సీబీఐలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలను కూలదోస్తోందని విమర్శించారు. భాజపాను ఎదుర్కోవడంలో కేసీఆర్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలను ఆయన నిలబెట్టుకోకుంటే రాష్ట్రంలో కమలదళం బలపడేందుకు కారణమవుతారన్నారు. కేసీఆర్‌ ఇప్పటికైనా చేసిన తప్పులను తెలుసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని