తెరాసలోకి కాంగ్రెస్కు చెందిన ఆరుగురు సర్పంచులు, ఒక ఎంపీటీసీ సభ్యుడు
మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో తెరాసకు పట్టం కడతారని, భారీ మెజారిటీతో విజయం ఖాయమని పీయూసీ ఛైర్మన్ ఎ.జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కాంగ్రెస్, భాజపాలు కొరివితో తలగోక్కుంటున్నాయని,
మునుగోడులో ఈసారి తెరాసకే పట్టం
ఎమ్మెల్యే ఎ.జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి
ఈనాడు, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో తెరాసకు పట్టం కడతారని, భారీ మెజారిటీతో విజయం ఖాయమని పీయూసీ ఛైర్మన్ ఎ.జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కాంగ్రెస్, భాజపాలు కొరివితో తలగోక్కుంటున్నాయని, ఆ రెండు పార్టీలు మునిగిపోవడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్కు చెందిన ఆరుగురు సర్పంచులు, ఒక ఎంపీటీసీ సభ్యుడు, ఇతర నేతలు ఆదివారం తెలంగాణ భవన్లో తెరాసలో చేరారు. నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, రావిగూడెం సర్పంచి గుర్రం సత్యం, కుంట్లగూడెం, కిష్టాపురం, చూళ్లేడు, కాల్వలపల్లి, జమీస్తాన్పల్లి సర్పంచులు మీరాళ్ల పారిజాతంగోపాల్, నందిపాటి రాధారమేశ్, జనిగెల మహేశ్వరిసైదులు, వంటెపాక జగన్గౌడ్, పంతంగి పద్మలతో పాటు కిష్టాపురం ఎంపీటీసీ సభ్యుడు భీమనపల్లి సైదులు వీరిలో ఉన్నారు. వీరికి జీవన్రెడ్డి, మధుసూదనాచారిలు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘‘రాజగోపాల్రెడ్డి వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెరాసలో చేరుతున్నారు. కాంగ్రెస్ నుంచి చేరినవాళ్లకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుంది’’ అని జీవన్రెడ్డి, మధుసూదనాచారి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ