సమాజహితమే తెదేపా లక్ష్యం

ఎందరో దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర ఫలాలను అందరికీ అందించే లక్ష్యంతో తెదేపా పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సమాజ హితమే పార్టీ లక్ష్యమని

Updated : 16 Aug 2022 07:08 IST

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎందరో దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్ర ఫలాలను అందరికీ అందించే లక్ష్యంతో తెదేపా పనిచేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సమాజ హితమే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు, నాయకులు టీడీ జనార్దన్‌, బి.వేదవ్యాస్‌, సీహెచ్‌ రాజశేఖర్‌, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పార్టీ సీనియర్‌ నాయకుడు లాల్‌జాన్‌బాషా వర్ధంతి సందర్భంగా అచ్చెన్నాయుడు, పార్టీ నాయకులు ఆయనకు నివాళి అర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని