తెలంగాణలో బెంగాల్‌ తరహా దాడులు: ఛుగ్‌

తెలంగాణలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పశ్చిమ బెంగాల్‌ తరహాలో తెరాస ప్రభుత్వం దాడులు చేస్తోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఓటమి

Published : 17 Aug 2022 05:49 IST

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై పశ్చిమ బెంగాల్‌ తరహాలో తెరాస ప్రభుత్వం దాడులు చేస్తోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే పోలీసుల సహాయంతో బండి సంజయ్‌ పాదయాత్రపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టంచేశారు. దిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమిత్‌ షా సభ ఏర్పాటు విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని