తెరాసకు పలువురు ప్రజాప్రతినిధుల రాజీనామా

కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు తెరాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక సమస్యలు పరిష్కారం కావడం లేదనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు మంగళవారం రాతపూర్వకంగా

Published : 17 Aug 2022 05:49 IST

బెజ్జూరు, న్యూస్‌టుడే: కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు తెరాస ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక సమస్యలు పరిష్కారం కావడం లేదనే మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వారు మంగళవారం రాతపూర్వకంగా తెలిపారు. తమ రాజీనామా ఆమోదించాలని కోరుతూ తెరాస జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు లేఖ పంపనున్నట్లు బెజ్జూరు జడ్పీటీసీ సభ్యురాలు పద్రం పుష్పలత, కుశ్నపల్లి ఎంపీటీసీ సభ్యుడు ఆత్రం సాయన్న, సుశ్మీర్‌, సోమిని, మొగవెల్లి సర్పంచులు శంకర్‌, శారద, మంగళ, కాగజ్‌నగర్‌ మార్కెట్ కమిటీ డైరెక్టరు నైతం సత్తయ్య, పీఏసీఎస్‌ డైరెక్టరు శ్రీహరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని