నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం కేసీఆర్: షర్మిల
తెలంగాణలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన తీసుకురావటమే లక్ష్యంగా పార్టీ పెట్టానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా అప్పక్పల్లి నుంచి మొదలై..
ఊట్కూరు, న్యూస్టుడే: తెలంగాణలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన తీసుకురావటమే లక్ష్యంగా పార్టీ పెట్టానని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన పాదయాత్ర మంగళవారం ఉదయం నారాయణపేట జిల్లా అప్పక్పల్లి నుంచి మొదలై.. ఊట్కూరు మండలంలోకి ప్రవేశించింది. మధ్యాహ్నం సమయానికి నిడుగుర్తి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో ఏటా నిరుద్యోగం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని అన్నారు. విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయలేదని విమర్శించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రైతులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తోందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, భాజపాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదని, తమ పార్టీ పోరాటం వల్లే కేసీఆర్ ప్రభుత్వానికి స్పృహ వచ్చిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం