పరకాలలో భాజపా నేతపై దాడి
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్పై మంగళవారం కొందరు తెరాస నాయకులు దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయనను వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన
కాపు కాసి కొట్టిన తెరాస నాయకులు
పరకాల, న్యూస్టుడే: హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్పై మంగళవారం కొందరు తెరాస నాయకులు దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయనను వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. పట్టణ సీఐ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం... మధ్యాహ్నం గురుప్రసాద్ ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా మూలమలుపు వద్ద కాపుకాసిన తెరాస కౌన్సిలర్ ఏకు రాజు, నాయకులు ఏకు సుభాష్, బొచ్చు జెమినితో పాటు మరికొందరు గుర్తుతెలియని వ్యక్తులు కర్ర, ట్యూబ్లైట్లతో దాడి చేశారు. గురుప్రసాద్ భార్య శ్రీదేవి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. తెరాసను, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గురుప్రసాద్ సామాజికమాధ్యమాల్లో పోస్టులు పెట్టడమే ఈ దాడికి కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. దాడిని ఖండిస్తూ భాజపా నేతలు బస్స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు