సుప్రీంకోర్టులో కొప్పుల ఈశ్వర్ పిటిషన్ కొట్టివేత
ధర్మపురి శాసనసభ స్థానం నుంచి ఎన్నికకు సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. 2018 శాసనసభ ఎన్నికల్లో వీవీ ప్యాట్లు లెక్కించకుండానే
ఈనాడు, దిల్లీ : ధర్మపురి శాసనసభ స్థానం నుంచి ఎన్నికకు సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. 2018 శాసనసభ ఎన్నికల్లో వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమంటూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ను తిరస్కరించాలంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను హైకోర్టు జూన్ 28న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై జస్టిస్ సంజయ్ కిషన్కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుంద్రేష్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పులో లోపాలున్నాయంటూ మంత్రి ఈశ్వర్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వారి వాదనలతో ధర్మాసనం విభేదించింది. పిటిషన్ ఉప సంహరణకు న్యాయవాదులు విజ్ఞప్తి చేయగా అందుకు అనుమతిస్తూనే పిటిషన్ కొట్టివేస్తున్నట్లు (డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్) ధర్మాసనం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్