పీసీసీ అధ్యక్షుడిలో లోపాలుంటే సరిదిద్దుకోవాలి: రేణుకాచౌదరి
కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమని, అవే సర్దుకుంటాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. గురువారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల
గాంధీభవన్, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమని, అవే సర్దుకుంటాయని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. గురువారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్తో ఆమె హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘శశిధర్రెడ్డి ఓపికగా ఉండే వ్యక్తి. ఆయనకు ఏదో మనసుకు బాధ అనిపించి మాట్లాడి ఉంటారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఆయనవైపు ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. పార్టీలో మమ్మల్ని(సీనియర్లను) అవమానించేవారు ఎవరూ లేరు. అవమానిస్తే దుమారం ఎలా లేపాలో మాకు కూడా తెలుసు’’ అని అన్నారు. ఖమ్మంలో తనను ఎదుర్కొనే మొనగాడు ఎవరూ లేరని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి కూడా ఠాగూర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాణికం ఠాగూర్ గురువారం మధ్యాహ్నం దిల్లీకి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!