నిరుద్యోగ భృతిపై సర్కారు నిర్లక్ష్యం: షర్మిల

బంగారు తెలంగాణలో బాగుపడింది సీఎం కుటుంబం మాత్రమేనని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నిరుద్యోగ భృతి మంజూరు విషయంలో ప్రభుత్వం పూర్తి

Published : 19 Aug 2022 04:22 IST

ఊట్కూరు, న్యూస్‌టుడే: బంగారు తెలంగాణలో బాగుపడింది సీఎం కుటుంబం మాత్రమేనని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నిరుద్యోగ భృతి మంజూరు విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆమె చేపట్టిన పాదయాత్ర నారాయణపేట జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం ఊట్కూరు మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలో మొదలైన పాదయాత్ర సాయంత్రానికి అదే మండలంలోని చొన్నపొర్ల గ్రామానికి చేరుకుంది. ఊట్కూరు, పెద్దపొర్లలో ఏర్పాటుచేసిన మాట-ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు