తెదేపాకు సహకరిస్తే నల్లుల్లా నలుపుతా.. వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్య

పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెదేపా వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌

Updated : 19 Aug 2022 11:24 IST

వినుకొండ, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెదేపా వారిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్‌ హాజరయ్యారు. ఆయన సమక్షంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... తెదేపా జిల్లా అధ్యక్షుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై విరుచుకుపడ్డారు. తాను అభివృద్ధి చేస్తుంటే ఆంజనేయులు కోర్టుల్లో కేసులు వేసి ఆపుతున్నారని ఆరోపించారు. జీవీకి సహకరించే కొన్ని నల్లులు ఉన్నాయని, వాళ్లను నిలిపేస్తానని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని