అన్ని పార్టీల్లోనూ మహిళల అంశాలు వివాదాస్పదం

అన్ని రాజకీయ పార్టీల్లోనూ మహిళలకు సంబంధించిన అంశాలు వివాదాస్పదం అవుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం రాజమహేంద్రవరంలో

Published : 19 Aug 2022 04:26 IST

వాసిరెడ్డి పద్మ

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: అన్ని రాజకీయ పార్టీల్లోనూ మహిళలకు సంబంధించిన అంశాలు వివాదాస్పదం అవుతున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం రాజమహేంద్రవరంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ... రాజకీయాల్లో మహిళలను అడ్డుపెట్టుకొని కుట్రలు చేయడం, వీడియోలను మార్ఫింగ్‌ చేయడం తీవ్ర నేరంగానే భావించాలన్నారు. మహిళల చుట్టూ రాజకీయాలు చేస్తే మళ్లీ వారు వంటింటికే పరిమితమయ్యే పరిస్థితులు వస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీలో మహిళలపై అన్ని రకాలుగా వేధింపులు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. తెదేపా నుంచి బయటకు వచ్చిన దివ్యవాణి, మరికొందరు ఆ పార్టీలో మహిళలపై జరుగుతున్న వేధింపులను బయట పెట్టిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని