జగన్‌ పాలనలో పరిశ్రమలు తరలిపోతున్నాయి

జగన్‌ పాలనలో రాష్ట్రంలోని అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అధ్యక్షతన

Updated : 19 Aug 2022 06:16 IST

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ పాలనలో రాష్ట్రంలోని అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ధ్వజమెత్తారు. అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో తానా మాజీ అధ్యక్షుడు సతీశ్‌ వేమన అధ్యక్షతన తెదేపా ఎన్నారై విభాగం సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ... ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, భూములు, గనులను దోచుకోవడం తప్ప మరొకటి లేదన్నారు. జగన్‌రెడ్డి దోపిడీ విధానాల వల్ల ఏపీలోని విద్యుత్తు సంస్థలు దివాళా తీశాయని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. ప్రజలపై సుమారు రూ.16 వేల కోట్ల విద్యుత్తు ఛార్జీల భారాన్ని జగన్‌ మోపారని మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో రాష్ట్రానికి అవమానకరమని సతీశ్‌ వేమన అన్నారు. తెదేపాను అధికారంలోకి తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తామని పలువురు ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, సాయిసుధ పాలడుగు తదితర ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని