21న తిరుపతిలో జనసేన జనవాణి
జనసేన జనవాణి కార్యక్రమాన్ని ఈనెల 21న తిరుపతిలోని జి.ఆర్.ఆర్.కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల ప్రజలు
అర్జీలు స్వీకరించనున్న పవన్కల్యాణ్
ఈనాడు, అమరావతి: జనసేన జనవాణి కార్యక్రమాన్ని ఈనెల 21న తిరుపతిలోని జి.ఆర్.ఆర్.కన్వెన్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల ప్రజలు తమ సమస్యలను జనసేన అధినేత పవన్కల్యాణ్ దృష్టికి తీసుకురావచ్చని పార్టీ పేర్కొంది. ప్రజలు ఇచ్చే అర్జీలను పవన్కల్యాణ్ స్వయంగా స్వీకరించి, వారి సమస్యలు వింటారు. ఇప్పటి వరకు విజయవాడ, భీమవరంలలో వచ్చిన సమస్యల పరిష్కారానికి జనసేన అధినేత అధికారులకు ప్రత్యేకంగా లేఖలు రాశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే... గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈనెల 22న పవన్కల్యాణ్ అధ్యక్షతన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. పార్టీ కార్యక్రమాలు, జనవాణి, కౌలు రైతు భరోసా యాత్ర, రోడ్ల దుస్థితిపై చేపట్టిన డిజిటల్ ప్రచారం తదితర అంశాలపై సమీక్షిస్తారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, గోదావరి వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి