Jagadish Reddy: కేసీఆర్ జాతీయ రాజకీయాలకు మునుగోడు కానుక
మునుగోడు ఉప ఎన్నికలో తెరాసను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి కానుకగా అందిస్తారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.
తెరాసను గెలిపించి ప్రజలు ఆశీర్వదిస్తారు
మంత్రి జగదీశ్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో తెరాసను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి కానుకగా అందిస్తారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. భాజపా కుట్రలను చిత్తుచేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతూ చారిత్రక తీర్పునిస్తారని చెప్పారు. ప్రజలు నిలదీస్తున్నారనే భయంతో భాజపా అగ్ర నేతలు మునుగోడుకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం కొండూరు గ్రామ కాంగ్రెస్ నేతలు, ఉపసర్పంచి పాలకుర్ల జంగయ్య గౌడ్, గ్రామపంచాయతీ సభ్యులు జహంగీర్, పగడాల రాములు, రాంబాబు, ఉడుగు శ్రీనులతో పాటు పలువురు శనివారం హైదరాబాద్లోని మంత్రి జగదీశ్రెడ్డి నివాసంలో తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడారు. ‘‘భాజపా దేశానికి తీరని ద్రోహంచేస్తోంది. కేసీఆర్ నాయకత్వమే శరణ్యమనే స్థితి వచ్చింది. ఈ తరుణంలో మునుగోడులో ఉపఎన్నిక రావడం తెరాసకు లాభించనుంది. ఇక్కడ గెలుపు ద్వారా కేసీఆర్ జాతీయరాజకీయాల్లో జైత్రయాత్ర ప్రారంభిస్తారు. రాజగోపాల్రెడ్డి వెంట ఒక్క భాజపానేతా రావడం లేదు. కాషాయ పార్టీకీ తెలంగాణలో చోటు లేదు. కాంగ్రెస్ పార్టీ దిల్లీలో లేదు.. గల్లీలో రాదని గుర్తించి, భాజపా, కాంగ్రెస్ నేతలంతా తెరాసలో చేరుతున్నారు’’ అని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం