భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా శివశక్తినాథ్‌ బక్షి

భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా డాక్టర్‌ శివశక్తి నాథ్‌ బక్షి నియమితులయ్యారు. ప్రస్తుతం భాజపా పత్రికలు, ప్రచురణల విభాగానికి కన్వీనర్‌గా ఉన్న ఆయన్ను పార్టీ అధ్యక్షుడు

Published : 24 Sep 2022 05:29 IST

ఈనాడు, దిల్లీ: భాజపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా డాక్టర్‌ శివశక్తి నాథ్‌ బక్షి నియమితులయ్యారు. ప్రస్తుతం భాజపా పత్రికలు, ప్రచురణల విభాగానికి కన్వీనర్‌గా ఉన్న ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జేపీనడ్డా ఆదేశాల మేరకు పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా నియమించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఈ స్థానంలో తెలంగాణకు చెందిన కామర్సు బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని