సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కొల్లు అంకబాబు అరెస్టు
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. జగన్
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
ఈనాడు డిజిటల్, అమరావతి: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఎంత మందిపై పీడీ యాక్టులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ ప్రభుత్వం పాత్రికేయులను కూడా వదలడం లేదు. గన్నవరం విమానాశ్రయంలో.. ఏపీ సీఎంవోలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి భార్య వద్ద బంగారం పట్టుబడిన వార్తను సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేశారని దౌర్జన్యంగా అరెస్టు చేశారు. 73 ఏళ్ల వృద్ధుడని కూడా చూడలేదు. నిజాన్ని పోస్టు చేస్తే అరెస్టులు చేస్తారా? జగన్ను ఎవరూ ప్రశ్నించకూడదా? ఏ వ్యక్తినైనా అరెస్టు చేయాలంటే ముందుగా 41ఏ నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు పదేపదే చెబుతోంది. కానీ ఏపీ సీఐడీ అధికారులు దీన్ని పెడచెవినపెడుతున్నారు’’ అని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?