ఒకే వేదికపైకి విపక్ష నేతలు
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో నిమగ్నమైన పలు పార్టీల నేతలు ఆదివారం ఒకే వేదికపైకి రానున్నారు. హరియాణాలోని ఫతేహాబాద్లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) నిర్వహించనున్న
ఫతేహాబాద్లో ఐఎన్ఎల్డీ సభ నేడు
దిల్లీ: కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాల్లో నిమగ్నమైన పలు పార్టీల నేతలు ఆదివారం ఒకే వేదికపైకి రానున్నారు. హరియాణాలోని ఫతేహాబాద్లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్డీ) నిర్వహించనున్న సభకు వీరు హాజరవుతున్నారు. ఐఎన్ఎల్డీ వ్యవస్థాపకుడు, మాజీ ఉపప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్సీపీ అధినేత శరద్పవార్, బిహార్ సీఎం, జేడీయూ అగ్రనేత నీతీశ్కుమార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత, బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు పాల్గొంటున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (టీఎంసీ), తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు(తెరాస), ఎన్.చంద్రబాబునాయుడు(తెదేపా), అఖిలేశ్ యాదవ్(సమాజ్వాదీ పార్టీ) తదితరులకు ఆహ్వానాలు వెళ్లాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.