హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి: షర్మిల
ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని అమలు చేయలేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శనివారం వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధి యావాపూర్లో
సంగారెడ్డి మున్సిపాలిటీ, సదాశివపేట, న్యూస్టుడే: ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ వాటిని అమలు చేయలేదని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. శనివారం వికారాబాద్ జిల్లా నుంచి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధి యావాపూర్లో షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర ప్రవేశించింది. సదాశివపేట బస్టాండ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి రెండుసార్లు అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పాలించినా అమలు చేయలేదని విమర్శించారు. ఎనిమిదేళ్ల తెరాస అసమర్థ పాలనపై కాంగ్రెస్, భాజపా ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. ఈ రెండు పార్టీలు విఫలమైనందుకే తాను ప్రజల్లోకి వచ్చినట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్