ఎమ్మెల్యే శ్రీదేవి అవినీతిపై విచారణ జరిపించాలి

గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పనితీరుతో పార్టీకి తీరని అన్యాయం జరుగుతుందని వైకాపా నేతలు ఆరోపించారు. మేడికొండూరులో శనివారం వారు

Published : 25 Sep 2022 04:59 IST

వైకాపా నేతల డిమాండ్‌

మేడికొండూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పనితీరుతో పార్టీకి తీరని అన్యాయం జరుగుతుందని వైకాపా నేతలు ఆరోపించారు. మేడికొండూరులో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. మేడికొండూరు జడ్పీటీసీ సభ్యుడు కందుల సిద్ధయ్య మాట్లాడుతూ శ్రీదేవి పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఆమె అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (అనిశా) విచారణ జరిపించాలని డిమాండు చేశారు. నియోజకవర్గంలో ఏదైనా పని జరగాలంటే ఎమ్మెల్యేకు ముందుగా డబ్బులు చెల్లించాలన్నారు. మండల పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని