వైకాపా నేతలు దోపిడీదారులు

వైకాపాలో ఉన్న నాయకులంతా దోపిడీదారులని భాజపా నాయకుడు సునీల్‌ దేవధర్‌ విమర్శించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గండి వెంకట

Published : 25 Sep 2022 04:59 IST

భాజపా నాయకుడు సునీల్‌ దేవధర్‌

అనకాపల్లి, న్యూస్‌టుడే: వైకాపాలో ఉన్న నాయకులంతా దోపిడీదారులని భాజపా నాయకుడు సునీల్‌ దేవధర్‌ విమర్శించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ గండి వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ప్రజాపోరు కార్యక్రమంలో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం చేస్తున్న దోపిడీలకు అడ్డు లేకుండా పోతోందన్నారు. ఇసుకను అమ్ముకుంటున్నారని తెలిపారు. పనులు చేసిన గుత్తేదారులకు డబ్బు చెల్లించడం లేదని, ఈ కారణంగా పనులు చేయడానికి వారు ముందుకు రావడం లేదని, దాంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ‘సీఎం జగన్‌ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారు. అందరినీ క్రైస్తవులుగా మార్చేయాలన్నదే జగన్‌ ధ్యేయం. దీన్ని భాజపా చూస్తూ ఊరుకోదు’ అని పేర్కొన్నారు. ప్రజాసామ్య దేశంలో ఏ పార్టీకీ శాశ్వత అధ్యక్షులు ఉండరని, జగన్‌ మాత్రం తానే శాశ్వత అధ్యక్షుడిని అంటూ తీర్మానాలు చేయించుకోవడం సిగ్గు చేటన్నారు. అనకాపల్లిలో కనీసం కంపోస్టు యార్డును ఏర్పాటు చేయలేని దుస్థితిలో మంత్రి అమర్‌నాథ్‌ ఉన్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు