జగన్‌రెడ్డిని చరిత్ర క్షమించదు

వేలాది మంది రాజధాని రైతుల గుండెకోతకు కారణమైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చరిత్ర క్షమించదని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల

Published : 25 Sep 2022 05:41 IST

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శైలజానాథ్‌

ఈనాడు, అమరావతి: వేలాది మంది రాజధాని రైతుల గుండెకోతకు కారణమైన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చరిత్ర క్షమించదని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే...నా ఇల్లు ఇక్కడే అని జగన్‌రెడ్డి ప్రచారం చేసింది నిజం కాదా? అని శనివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కన్నీరు పెట్టించి జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నిస్తే రైతులను మంత్రులతో తిట్టిస్తున్నారు. అధికార మదంతో అడ్డగోలుగా వాగితే మంత్రులకు తగిన బుద్ధి చెబుతాం. మంత్రుల నోటిని అదుపు చేయలేని జగన్‌రెడ్డికి...రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా లేదు. అమరావతి రైతుల పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయి...’ అని ఆయన పేర్కొన్నారు. ‘సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబుపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్‌రెడ్డి చేతికాని పాలనను ప్రశ్నిస్తే పోలీసులతో కేసు పెట్టిస్తారా? జగన్‌రెడ్డి అప్రజాస్వామిక విధానాలపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది...’ అని శైలజానాథ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు