క్రికెట్ ఆడకపోయినా జైషాకు బీసీసీఐ పదవి
కేంద్ర హోం మంత్రి అమిత్షా కుమారుడు జైషా క్రికెట్ ఆడకపోయినా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఇలా
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్
చౌటుప్పల్, న్యూస్టుడే: కేంద్ర హోం మంత్రి అమిత్షా కుమారుడు జైషా క్రికెట్ ఆడకపోయినా బీసీసీఐ కార్యదర్శిగా నియమితులయ్యారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. ఇలా వచ్చిన వారు ప్రతిభావంతులను పక్కకు నెట్టి ఆ సంస్థలోని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా ఆదివారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, లక్కారం, తంగడపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళి అర్పించారు. అనంతరం ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గుజరాత్ వ్యాపారులకు దేశాన్ని కట్టబెడుతున్నారని, నిత్యావసర సరకుల ధరలు పెంచి పేదల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల ద్వారా కమీషన్ల రూపంలో రూ.వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెలంగాణ మహిళలకు నాసిరకం చీరలు పంపిణీ చేసి వారిని అవమానిస్తున్నారన్నారు. బహుజన రాజ్యం సిద్ధించాక కేసీఆర్ అక్రమ ఆస్తులను ప్రజలకు పంచిపెడతామని చెప్పారు. అర్హతగల ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని, పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!