పేదలకు మేలు చేసింది కాంగ్రెస్సే
అణగారిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలని ఇళ్లు, భూములు పంచింది కాంగ్రెస్ పార్టీయేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
సంస్థాన్ నారాయణపురం, న్యూస్టుడే: అణగారిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలని ఇళ్లు, భూములు పంచింది కాంగ్రెస్ పార్టీయేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం, వాయిళ్లపల్లి, బోటిమీదితండాలో నిర్వహించిన ‘మన మునుగోడు- మన కాంగ్రెస్’ రచ్చబండ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. రాచకొండ అడవిలోని గిరిజనులను ఆదుకోవాలని ఆనాడు కాంగ్రెస్ రెండువేల ఎకరాల పోడు భూములను వారికి పంచిందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు గెలిపిస్తే వెన్నుపోటు పొడిచారన్నారు. ఆడబిడ్డ పాల్వాయి స్రవంతికి ఉపఎన్నికలో ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని సర్వేల్ గ్రామంలో ఇటీవల తాను మాట్లాడినట్టు సీపీఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తానలా మాట్లాడినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.