Seediri Appalaraju: కాళ్ల బేరానికైనా వెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుద్దాం: మంత్రి అప్పలరాజు

అవసరమైతే కాళ్లబేరానికైనా వెళ్లి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుద్దామని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం

Updated : 27 Sep 2022 07:03 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: అవసరమైతే కాళ్లబేరానికైనా వెళ్లి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుద్దామని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైకాపా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరఫున సీతంరాజు సుధాకర్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారన్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా గెలవాల్సిందే అన్నారు. ఇందుకోసం అవసరమైతే కాళ్లబేరానికైనా వెళదామన్నారు. మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే వైకాపాకు నష్టమని అభిప్రాయపడ్డారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని