దోపిడీకి ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ

రాష్ట్ర సంపదను దోచుకోడానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

Published : 27 Sep 2022 04:34 IST

జగన్‌పై కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాష్ట్ర సంపదను దోచుకోడానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు చేశారని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో సోమవారం భాజపా ఆధ్వర్యంలో ప్రజాపోరు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘రాష్ట్ర సంపదను లూటీ చేస్తున్నారు. ఇసుక, మద్యం, గనులు, ఎర్రచందనం, సముద్ర సంపదతో వ్యాపారం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు చాక్లెట్‌ ఇచ్చి నెక్లెస్‌ ఎత్తుకెళ్లిన చందంగా పేదలకు రూ.10 అందించి విద్యుత్తు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌తోపాటు చెత్తపై పన్నువేసి ప్రజల రక్తాన్ని పిండేస్తున్నారు’ అని కన్నా ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని