అలజడి సృష్టించడానికే రైతుల పాదయాత్ర: మంత్రి రోజా

రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే కొంతమంది అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సోమవారం...

Updated : 27 Sep 2022 04:53 IST

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అలజడి సృష్టించడానికే కొంతమంది అమరావతి రైతుల పేరుతో పాదయాత్ర చేస్తున్నారని మంత్రి రోజా ఆరోపించారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సోమవారం వైఎస్సార్‌ క్రీడా వికాస కేంద్ర ప్రారంభోత్సవానికి హాజరైన ఆమె మాట్లాడారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాల అభివృద్ధిని ఫణంగా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో కోట్ల మంది గుండెలను కాపాడిన వైఎస్సార్‌ పేరును యూనివర్సిటీకి పెట్టడం సమంజసమేనని సమర్ధించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను మోసం చేసినా కుటుంబసభ్యులు పట్టించుకోలేదని, వారే అండగా ఉంటే ఎన్టీఆర్‌ ప్రధాని అయ్యేవారని రోజా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు