YS Sharmila: కేటీఆర్‌కు జగ్గారెడ్డి కోవర్టు: షర్మిల

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్‌కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయం గాంధీ భవన్‌లో అందరికీ తెలుసని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో

Updated : 27 Sep 2022 06:46 IST

సంగారెడ్డి మున్సిపాలిటీ, కంది, న్యూస్‌టుడే: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంత్రి కేటీఆర్‌కు కోవర్టుగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయం గాంధీ భవన్‌లో అందరికీ తెలుసని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల, చిద్రుప్ప గ్రామాల్లో సోమవారం నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడారు. వైఎస్సార్‌ ఎప్పుడు పార్టీ మారారో చెప్పాలని జగ్గారెడ్డిని డిమాండ్‌ చేశారు. ఆయనలా పార్టీలు మారే సంస్కృతి వైఎస్సార్‌కు లేదని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్‌ విజయంలో వైఎస్సార్‌ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయనను పార్టీ గౌరవించడం లేదన్నారు. పాదయాత్ర 2,300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆరుట్లలో వైఎస్‌ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని