ఏపీని మూడు రాష్ట్రాలు చేసుకొని.. ముగ్గురు ముఖ్యమంత్రులు అవ్వండి
ఆంధ్రప్రదేశ్ను మూడు రాజధానులు కాకుంటే మూడు రాష్ట్రాలు చేసుకుని.. జగన్, షర్మిల, విజయసాయిరెడ్డిలు ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా
హైదరాబాద్, న్యూస్టుడే: ఆంధ్రప్రదేశ్ను మూడు రాజధానులు కాకుంటే మూడు రాష్ట్రాలు చేసుకుని.. జగన్, షర్మిల, విజయసాయిరెడ్డిలు ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. జగన్కు చెప్పి షర్మిలను సీఎం చేయాలని వై.ఎస్.విజయమ్మకు సలహా ఇస్తున్నానని అన్నారు. ‘‘మీ కుటుంబం అంతా మోదీ దగ్గర కూర్చుని మూడు రాష్ట్రాలు చేసుకోండి. కానీ, మీ ఇంటి పంచాయితీ ఇక్కడి(తెలంగాణ) జనానికి చుట్టకండి’’ అని హితవు పలికారు. మంత్రి కేటీఆర్కు కోవర్టు అంటూ తనపై వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేసిన వ్యాఖ్యలను జగ్గారెడ్డి ఖండించారు. ఆమె భాజపా ఏజెంటని ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియాహాలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘నా దమ్ము చూసి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్లోకి పిలిచారు. ఆయనకు నచ్చిన నేను షర్మిలకు నచ్చలేదంటే ఆమెకు రాజకీయ పరిజ్ఞానం లేదని అర్థం. ఆమె నోరు అదుపులో పెట్టుకోకపోతే అన్ని విషయాలు బయటపెడతా’’ అని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?