భాజపా దృష్టిలో మహిళలంటే వస్తువులే
భాజపాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాజాగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలను కమలదళం ఏమాత్రం గౌరవించదని, ఆ పార్టీ దృష్టిలో వారు కేవలం వస్తువులేనని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో ఇటీవల అంకితా
విమర్శలు గుప్పించిన రాహుల్
దిల్లీ, మలప్పురం: భాజపాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తాజాగా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలను కమలదళం ఏమాత్రం గౌరవించదని, ఆ పార్టీ దృష్టిలో వారు కేవలం వస్తువులేనని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో ఇటీవల అంకితా భండారీ అనే యువతి ఆ పార్టీ నాయకుడి కుమారుడి చేతిలో దారుణ హత్యకు గురవడాన్ని ఇందుకు నిదర్శనంగా చెప్పారు. కేరళలోని మలప్పురంలో మంగళవారం భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ ప్రసంగించారు. భాజపా నాయకుడి కుమారుడు అంకితను వ్యభిచారిణిగా మార్చాలనుకున్నాడని, అందుకు ఆమె నిరాకరించడంతో దారుణంగా చంపేశాడని ఆయన పేర్కొన్నారు. ‘‘దేశంలో మహిళలను కమలదళం, ఆరెస్సెస్ ఎలా చూస్తాయో చెప్పేందుకు అత్యంత హేయమైన ఉదాహరణ ఇది. వారు స్త్రీలను వస్తువులుగా, ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తారు. అతివలను గౌరవించని, వారి సాధికారత కోసం కృషిచేయని దేశం ఎన్నడూ పురోగతి సాధించబోదు’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్