న్యాయ వ్యవస్థపై శాసనవ్యవస్థ దాడి చేస్తుందా?
రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతేనని హైకోర్టు తీర్పు చెప్పడం తప్పెలా అవుతుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఈనాడు, దిల్లీ: రాష్ట్రానికి ఒకే రాజధాని అమరావతేనని హైకోర్టు తీర్పు చెప్పడం తప్పెలా అవుతుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని, దానిపై వాదనలు ముగిసి తీర్పు వెలువడే వరకు వేచి చూసే ఓపిక మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. దిల్లీలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా, వికేంద్రీకరణకు మద్దతుగా తన మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడిస్తున్నారు. న్యాయ వ్యవస్థపై శాసన వ్యవస్థ దాడి చేస్తుందా? అటువంటి శాసన వ్యవస్థలోని వారు పదవిలో ఉండడానికి అనర్హులు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఇంతకంటే కారణం ఏం కావాలి? వికేంద్రీకరణ ఉద్యమానికి మద్దతుగా మేం శ్రీకాకుళం నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించలేమా? అని మంత్రి బొత్స వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో మంత్రులు ఏసీ బస్సులు వేసుకొని ఊరూరా తిరిగితే వారి సభల్లో 90% ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చిన విషయాన్ని గుర్తుచేసుకోవాలి.
దమ్ముంటే మంత్రులు వికేంద్రీకరణకు మద్దతుగా పాదయాత్ర ప్రారంభించాలి. ప్రభుత్వ సభలకు రాకుంటే సంక్షేమ పథకాలను ఆపివేస్తామని ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర వ్యాఖ్యానించడం సరికాదు. రాష్ట్ర ప్రభుత్వ కేసులను వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులే... వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శివశంకర్రెడ్డి కేసు వాదించడం అనుమానాలకు తావిస్తోంది’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల