గిరిజనుల పిల్లల్ని వైద్యులు, ఇంజినీర్లను చేయండి

గిరిజనులను బస్సుల్లో తీసుకెళ్లి హైదరాబాద్‌లోని సేవాలాల్‌ భవనం చూపించడం కాదని, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి వైద్యులు, ఇంజినీర్లు చేయాలని బీఎస్పీ

Published : 29 Sep 2022 04:43 IST

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: గిరిజనులను బస్సుల్లో తీసుకెళ్లి హైదరాబాద్‌లోని సేవాలాల్‌ భవనం చూపించడం కాదని, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి వైద్యులు, ఇంజినీర్లు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్ర రెండో విడతలో భాగంగా యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని గిరిజన తండాల్లో ఆయన బుధవారం పర్యటించారు. వారం రోజుల్లో గిరిజన బంధు, రిజర్వేషన్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించి పది రోజులు దాటినా జాడ లేదని విమర్శించారు. బహుజన రాజ్యంలో గిరిజనుల పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. నూతన గిరిజన గ్రామపంచాయతీలకు నిధులివ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని