కేరళ నుంచి తమిళనాడులోకి..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్‌ జోడో యాత్ర గురువారం కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనుంది. ఈ నెల 10న కేరళలోకి యాత్ర ప్రవేశించిన

Published : 29 Sep 2022 05:04 IST

నేడు ప్రవేశించనున్న భారత్‌ జోడో యాత్ర

మలప్పురం, వయనాడ్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్‌ జోడో యాత్ర గురువారం కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనుంది. ఈ నెల 10న కేరళలోకి యాత్ర ప్రవేశించిన సంగతి తెలిసిందే. గురువారం కూడా ఆ రాష్ట్రంలో పాదయాత్ర కొంతదూరం సాగనుంది. దాన్ని కూడా కలుపుకొంటే మొత్తంగా కేరళలో ఏడు జిల్లాల్లో 440 కిలోమీటర్ల మేర నడిచినట్లవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతిని పురస్కరించుకొని యాత్ర సందర్భంగా ఆయనకు రాహుల్‌ నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని