అమరావతి రైతులపై సీఎం జగన్‌ కక్ష కట్టారు

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌ ప్రజలను మభ్యపెడుతూ అమరావతిని అటకెక్కించారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు.

Published : 30 Sep 2022 03:19 IST

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శ

తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌ ప్రజలను మభ్యపెడుతూ అమరావతిని అటకెక్కించారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అమరావతి రైతులపై జగన్‌ కక్ష కట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, ఎర్రచందనం, ఖనిజాలు, ప్రకృతి సంపద... నిలువు దోపిడీకి గురవుతున్నాయన్నారు. జగన్‌ వైఖరి కారణంగా విభజన చట్టాలు అమలు కావడం లేదని, కేంద్ర నిధులను వైకాపా పథకాలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు సేవా పక్షోత్సవాల్లో భాగంగా రుయా ఆసుపత్రి దగ్గర అన్నదానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని