భాజపాకు లబ్ధి చేసేలా కేసీఆర్‌ రాజకీయ అడుగులు: మధుయాస్కీగౌడ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ అడుగులు భాజపాకు లబ్ధి చేసేలా ఉన్నాయని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ విమర్శించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల

Published : 30 Sep 2022 04:28 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయ అడుగులు భాజపాకు లబ్ధి చేసేలా ఉన్నాయని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ విమర్శించారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దిల్లీ మద్యం కుంభకోణం నుంచి తప్పించుకునేందుకు భాజపాకు కేసీఆర్‌ అంతర్గతంగా సహకారం అందిస్తున్నారని ఆరోపించారు.

వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే: మహేశ్‌కుమార్‌

సమస్యలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పార్టీని తెరపైకి తెస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ఆయన జాతీయ పార్టీ గతంలో ప్రభుత్వం అమలు చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ లాంటిదేనని, మధ్యలోనే మూసేస్తారని జోస్యం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని