ప్రతి నిరుపేదకు ఎకరా ఇస్తాం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

బహుజన రాజ్యంలో ప్రతి నిరుపేదకు ఎకరం భూమి ఇచ్చి పట్టాలు పంపిణీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం ఆయన

Published : 30 Sep 2022 04:28 IST

సంస్థాన్‌ నారాయణపురం, న్యూస్‌టుడే: బహుజన రాజ్యంలో ప్రతి నిరుపేదకు ఎకరం భూమి ఇచ్చి పట్టాలు పంపిణీ చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా గురువారం ఆయన యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో పర్యటించారు. జనగాం గ్రామంలో ఓ వడ్రంగితో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, మాంసం పంచి అభివృద్ధిని ఆమడదూరంలో ఉంచుతున్నారన్నారు. తండాల్లో సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వం హైదరాబాద్‌లో గిరిజన భవనాలు కడుతూ ప్రజల్ని మభ్యపెడుతోందని విమర్శించారు. పలు గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని