అమిత్‌షాతో రాజగోపాల్‌రెడ్డి భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురువారం రాత్రి దిల్లీలో కలిశారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అమిత్‌షాకు ఆయన వివరించారు.

Published : 01 Oct 2022 04:43 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురువారం రాత్రి దిల్లీలో కలిశారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అమిత్‌షాకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఉపఎన్నిక కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర హోంమంత్రి పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం కలిశారు. మునుగోడు ఉపఎన్నికపై వారిద్దరూ చర్చించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని