కొవిడ్‌ మృతుల కుటుంబాలవారు నష్టపరిహారానికి అర్హులు కారా?

ప్రధానమంత్రి జీ! కొవిడ్‌ మహమ్మారిని మీ ప్రభుత్వం సమర్థంగా నిర్వహించని కారణంగా దేశంలో ఎంతోమంది మృత్యువుపాలయ్యారు.

Published : 02 Oct 2022 05:23 IST

ప్రధానమంత్రి జీ! కొవిడ్‌ మహమ్మారిని మీ ప్రభుత్వం సమర్థంగా నిర్వహించని కారణంగా దేశంలో ఎంతోమంది మృత్యువుపాలయ్యారు. బాధిత కుటుంబాల వారు నష్టపరిహారం పొందడానికి అర్హులు కారా? వారి హక్కును మీరెందుకు కాలరాస్తున్నారు? తండ్రిని కోల్పోయిన కర్ణాటక గుండ్లుపేట్‌కు చెందిన చిన్నారి ప్రతీక్ష ఆవేదన విన్నారా?

- రాహుల్‌గాంధీ


చిట్టచివరి వ్యక్తినీ చేరదీయడమే మా లక్ష్యం

పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ అంత్యోదయ భావజాలం, సమగ్ర మానవతావాదాన్ని అమలు చేయడమే మా లక్ష్యం. మోదీ ప్రభుత్వం సమాజంలోని చిట్టచివరి వ్యక్తిని కూడా చేరదీసి, అభివృద్ధి పథాన నడిపించేందుకు ప్రయత్నిస్తోంది.

- నితిన్‌ గడ్కరీ


 

భాజపా పాలనలో ప్రజలు ఇప్పటికే 5జీ అనుభవిస్తున్నారు

దేశ ప్రజలు కాషాయ పార్టీ పాలనలో పేదరికం, కుంభకోణాలు, మోసం, అబద్ధాలు, తప్పుడు మాటలు అనే 5జీ సేవలతో సతమతం అవుతున్నారు.       

- అఖిలేశ్‌ యాదవ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు