గుజరాత్లో వికసించేది కమలమే!
త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో భాజపా విజయదుందుభి మోగించబోతోందని ఏబీపీ న్యూస్- సీ ఓటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ (ఒపీనియన్ పోల్) అంచనా వేసింది. కమలనాథులు ఏడోసారి అధికారంలోకి రాబోతున్నారనీ, 135 నుంచి 143 స్థానాలు వారికి లభించనున్నాయని ఆదివారం ఏబీపీ న్యూస్ వెల్లడించింది.
భాజపా ఖాతాలో 135-143 సీట్లు
ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ఒపీనియన్ పోల్లో వెల్లడి
అహ్మదాబాద్: త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో భాజపా విజయదుందుభి మోగించబోతోందని ఏబీపీ న్యూస్- సీ ఓటర్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ (ఒపీనియన్ పోల్) అంచనా వేసింది. కమలనాథులు ఏడోసారి అధికారంలోకి రాబోతున్నారనీ, 135 నుంచి 143 స్థానాలు వారికి లభించనున్నాయని ఆదివారం ఏబీపీ న్యూస్ వెల్లడించింది. ‘182 స్థానాలున్న గుజరాత్లో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది. ఆ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లకు మించి రావు. భాజపా, కాంగ్రెస్ల ఓట్ల శాతానికి ఆప్ గండికొడుతుంది. భాజపా 46.8%, కాంగ్రెస్ 32.3%, ఆప్ 17.4% ఓట్లు పొందుతాయి. కాంగ్రెస్కి 36 నుంచి 44 స్థానాల మధ్య వస్తాయి. ఇతరులు 3.5% ఓట్లతో 0-3 సీట్లు పొందే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ మరోసారి ఆ పదవిలోకి రావాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. 2017లో భాజపా 99 స్థానాలు పొందగా ఈసారి అవి బాగా పెరగనున్నాయి’ అని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
C-Vigil: సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM