సోనియా, రాహుల్ నకిలీ గాంధీలు
గాంధీ జయంతి రోజున సోనియాగాంధీ, రాహుల్గాంధీ, డీకే శివకుమార్ వంటి నకిలీ గాంధీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై
ఈనాడు, బెంగళూరు: గాంధీ జయంతి రోజున సోనియాగాంధీ, రాహుల్గాంధీ, డీకే శివకుమార్ వంటి నకిలీ గాంధీల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. భారత్ ఐక్యతా యాత్రలో కర్ణాటక ప్రభుత్వంపై రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై ఆదివారం ముఖ్యమంత్రి బొమ్మై స్పందిస్తూ..సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్లు బెయిల్పై ఉన్నారని, గాంధీ జయంతి రోజున ఈ నకిలీ గాంధీల గురించి ఎందుకు మాట్లాడాలన్నారు. దేశమంతా ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో నిధుల కోసం కర్ణాటకను ఏటీఎంగా మార్చిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఖండించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.