గాంధీ, అంబేడ్కర్ సిద్ధాంతాలపై పుట్టిందే లోక్సత్తా
మహత్మాగాంధీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ఆచరిస్తూ వాటిని చట్టబద్ధంగా అమలుచేయడమే లక్ష్యంగా లోక్సత్తా ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్ నారాయణ(జేపీ) అన్నారు.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో జయప్రకాశ్ నారాయణ
మల్కాజిగిరి, న్యూస్టుడే: మహత్మాగాంధీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ఆచరిస్తూ వాటిని చట్టబద్ధంగా అమలుచేయడమే లక్ష్యంగా లోక్సత్తా ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్ నారాయణ(జేపీ) అన్నారు. లోక్సత్తా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తూర్పు ఆనంద్బాగ్ డివిజన్ వెంకటేశ్వరనగర్లోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం రాష్ట్ర ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చాక అందరూ గాంధీ, అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలు గొప్పవని చెబుతున్నారే తప్ప వాటికి చట్టబద్ధత కల్పించడం లేదని జేపీ విమర్శించారు. పాలకులు స్థానికసంస్థల నుంచి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రజాస్వామ్య పాలనలో అధికార వ్యవస్థ వల్ల మేలు జరుగుతుందన్నారు. సంస్కరణల దిశగా తమ పార్టీ బహుముఖ పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు. లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాసు సభకు అధ్యక్షత వహించారు. నేషనల్ పీపుల్స్ ఫ్రంట్ ఛైర్మన్ వీజీఆర్ నారగోని, విశ్రాంత జాయింట్ కలెక్టర్ సూర్యనారాయణ, పార్టీ కన్వీనర్ కటారి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస వర్మ, యువజన విభాగం ప్రతినిధి శివరామకృష్ణ, కిషోర్, సరోజినీదేవి, గజానని ప్రసంగించారు. అంతకుముందు మల్కాజిగిరి గాంధీపార్కులోని మహాత్ముడి విగ్రహానికి జేపీ నివాళి అర్పించి, కూడలిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్