విజయనగరంలో లోక్‌సత్తా ఆవిర్భావ దినోత్సవం

ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే.. రాజకీయాలు మారాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతోనే డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ లోక్‌సత్తాను స్థాపించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు.

Updated : 04 Oct 2022 06:05 IST

విజయనగరం గంటస్తంభం, న్యూస్‌టుడే: ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే.. రాజకీయాలు మారాల్సిన అవసరం ఉందన్న ఆలోచనతోనే డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ లోక్‌సత్తాను స్థాపించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తెలిపారు. సోమవారం లోక్‌సత్తా పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయనగరంలోని కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి గౌరవ వందనం చేశారు. దేశంలో మౌలిక మార్పుల కోసం జేపీ పడుతున్న తపనను నేటి తరం యువత గుర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు నాగభూషణం, తాట్రాజు రాజారావు, రాజు, మొల్లేటి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని