13 ఏళ్ల పిల్లల చేతికి గంజాయి అందడం ఆందోళనకరం
విజయవాడలో 13 ఏళ్ల బాలికలు గంజాయి తీసుకున్న ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వేధింపులకు పోలీసులను వినియోగించడంలో మునిగిపోయిన ప్రభుత్వం.. యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేయడం క్షమించరాని నేరమని ట్విటర్ వేదికగా సోమవారం ఆయన మండిపడ్డారు.
తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: విజయవాడలో 13 ఏళ్ల బాలికలు గంజాయి తీసుకున్న ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వేధింపులకు పోలీసులను వినియోగించడంలో మునిగిపోయిన ప్రభుత్వం.. యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేయడం క్షమించరాని నేరమని ట్విటర్ వేదికగా సోమవారం ఆయన మండిపడ్డారు. ‘‘బాలికలు గంజాయి తాగడం నివ్వెరపరిచింది. పాఠశాల పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే, పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతోంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. సమూలంగా గంజాయిని అరికట్టేలా సత్వర చర్యలు తీసుకోవాలి. కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది...’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని తన ట్వీట్కు జత చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు